కెసిఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి: ఎమ్మెల్యే వనమా
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సుజాతనగర్ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో చిరకాల వాంఛ అయినా సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం గా ఉందన్నారు.
నా తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ఎవరేమనుకున్నా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. తొలుత కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నుంచి ఎమ్మెల్యే వనమాకు ఘన స్వాగతం గారు.