కాంగ్రెస్తోనే అభివృద్ధి
![కాంగ్రెస్తోనే అభివృద్ధి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642c0daf3e70e.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెంచారపు శ్రీనివాస్రెడ్డి అన్నారు. టీపీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు పార్టీ పట్టణ ధర్మపురి శ్రీనివాస్, నాయకులు వేముల రాజు, పూల సుధాకర్ పట్టణంలోని 10, 11వ వార్డులో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు.
కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డితో పాటు వడ్లకొండ పీఏసీఎస్ డైరెక్టర్ వంగళ మల్లారెడ్డి, ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలన్నారు. కార్యక్రమం మైనార్టీ జిల్లా నాయకులు జఫర్ షరీఫ్, పట్టణ నాయకులు రంగు రవి, మండల ఉపాధ్యక్షుడు సర్వర్, ప్రధాన కార్యదర్శి సలేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.