నేడే ఇండ్ల స్థలాల కొరకు కలెక్టరేట్ ముందు ధర్నా
![నేడే ఇండ్ల స్థలాల కొరకు కలెక్టరేట్ ముందు ధర్నా](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649ee03718455.jpg)
శంకరపట్నం ముద్ర జూన్ 30: రాష్ట్రంలో పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాల కొరకు శనివారం రోజున కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు ఆరోపించారు. శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షల కాకుండా ఐదు లక్షల ఇవ్వాలని అయన కోరారు. అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచిన ఒక్కరికి ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు, ఇంటి స్థలాలకై రేపటి ధర్నాకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఆయన కోరారు.