ప్రమాద బీమా చెక్కు పంపిణీ

ప్రమాద బీమా చెక్కు పంపిణీ

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామానికి చెందిన జలకంటి శాంతమ్మ కు బిఆర్ఎస్ పార్టీ నుండి మంజూరైన ప్రమాద భీమా చెక్కును ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి బాధితురాలికి అందజేశారు.చిక్కేపల్లి గ్రామానికి చెందిన జిలకంటి ఆంజనేయులు
గత 4 నెలల క్రితం చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు.మృతి చెందిన వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీలో  సభ్యత్వం ఉన్నందున పార్టీ నుండి మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య శాంతమ్మకు అందజేశారు.చెక్కు మంజూరుకు కృషి చేసిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి,ఎంపీపీ శ్రీధర్ రెడ్డికి, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు,చిక్కేపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల మాజీ కోఆర్డినేటర్ వెంకటయ్యనాయుడు,మాజీ సర్పంచ్ ముంత బాలస్వామి,గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాములు యాదవ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాదర్,బిచ్చాలు,ధర్మారెడ్డి,నరసింహస్వామి,టైగర్ రాములు తదితరులు ఉన్నారు.