బిఆర్ఎస్ నేతల సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ 

బిఆర్ఎస్ నేతల సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ 

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రానికి చెందిన అడుప రాజక్కకు  28 వేల రూపాయల  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును  బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంపీపీ బి.రాణి బాయి రామారావు, గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు, పట్టణ అధ్యక్షులు కూరతోట రాకేష్  పంపిణీ చేశారు. సూరారం గ్రామంలో పద్మకు 20 వేలు పాపయ్యకు 14 వేలు మోతే లక్ష్మికి 20 వేలు రూపాయల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూరారం సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు కేదారి గీత,మండల యూత్ అధ్యక్షులు అలీo ఖాన్, బిసి సెల్ మండల అధ్యక్షులు కారెంగుల బాపు రావు, సోషల్ మీడియా ఇంఛార్జి దబ్బెట రవీందర్, పట్టణ యూత్ అధ్యక్షులు రేవెల్లి రాజశేఖర్, సాయిబాబా ఆలయం చేర్మెన్ మెరుగు లక్ష్మణ్, మండల యూత్ ఆర్గనైజర్ చిలుక రమేష్, సీనియర్ నాయకులు కూరతోట శ్రీహరి, ఎస్ సి సెల్ మండల నాయకులు దికోండ మల్లేష్, చింతకుంట్ల సతీష్ పాల్గొన్నారు. లబ్ధిదారులు అడప రాజక్క తదితరులు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జ్ పుట్ట మధుకర్ మరియు భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షినిలకు కృతజ్ఞతలు తెలిపారు.