రూ.21 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రూ.21 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

 ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని నాలుగు రాష్ట్రాల ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 21,35,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, నాయకులు రాగి అశోక్, అరవింద్ గౌడ్, బొద్దుల కృష్ణ, రాజు, సాదిక్, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.