అనాధపిల్లలకు దుప్పట్ల పంపిణీ

అనాధపిల్లలకు దుప్పట్ల పంపిణీ

ముద్ర న్యూస్-గార్ల:జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని బాలభవన్ అనాధ పిల్లలకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గండి సీతారాం ఆయన సతీమణి గీతలు దుపట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తన స్వార్ధం ఆలోచించుకుంటు మనుషులు మనుషులనే మోసాలు చేస్తున్న ఈ రోజుల్లో పరులకు సహాయం చేయాలన్న గొప్ప లక్ష్యంతో జస్ట్ ఫర్ లీవింగ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని 8సంవత్సరాలుగా పేదలకు అనాధాలకు వృద్దులకు సేవలు చేస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకులు సీతారాం గీతాలను ఆయన అభినందించారు. సంస్థ ఉదేశాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి వారు తనవంతు సేవాలందించాలని కోరారు.

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రజసేవాకు అంకితమైన గండి సీతారాం దంపతులు ఆదర్శనీయులని వారి స్వచ్ఛమైన మనస్సుతో 100వసంతాలు నింపుకోవాలని, వారి సేవలు నూరేళ్లు అందించాలని కోరారు. సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ గా సేవలందిస్తూనే ఓ స్వచ్చంద సేవలందించే గొప్ప గుణాన్ని మండల విలేకరులు టియుడబ్ల్యూజె ఐజేయు నాయకులు కొనియాడారు.అనంతరం ముఖ్య అతిథులకు, పాఠశాల యాజమాన్యానికి సీతారాం దంపతులు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బుడాన్, సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జవ్వాజి శ్రీనివాస్, శేరిపురం మాజీ సర్పంచ్ జిగట వెంకన్న, ఖమ్మం సీనియర్ జర్నలిస్ట్ మణికుమార్, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పక్కి దిలీప్, కిరణ్ కుమార్, శేఖర్, శ్రావణి, కవిత తదితరులు.