విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ

ముద్ర, ప్రతినిధి, బెల్లంపల్లి (మంచిర్యాల) : బెల్లంపల్లి లోని జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాల ఇంక్లైన్  2 లో  తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. మంగళవారం విద్యార్థులకు పుస్తకాలు,  ఏకరూప దుస్తులు విద్యార్థుల కు పంపిణీ చేశారు.  తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్ధులకు అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులచే సంస్కృత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్మాస్టర్ ఉమాకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.