రేగిళ్ల సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ...

రేగిళ్ల సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు రేగిళ్ల సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాప్రా డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో  జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహింఛి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.వారితోపాటు కార్పొరేటర్లు స్వర్ణరాజ్ శివమణి, బొంతు శ్రీదేవి యాదవ్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, పావని రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ఉద్యమ నాయకులు బిజెపి, కాంగ్రెస్, టిడిపి, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.