కీర్తిశేషులు చెన్నాడి మార్తాండ రావు ట్రస్టు ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

కీర్తిశేషులు చెన్నాడి మార్తాండ రావు ట్రస్టు ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం ప్రాథమిక పాఠశాలలో కీర్తిశేషులు చెన్నాడి మార్తాండ రావు ట్రస్టు ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చెన్నాడి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ: త్వరలో అన్ని హంగులతో ప్రాథమిక పాఠశాల నూతన భవనం పూర్తి అవుతుందని తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షిత్ మాట్లాడుతూ: విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ  భాగ్యలత, సంపత్ రావు, ఎంపీటీసీ మమత సృజన్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరుశురాములు, ఎస్ఎంసి చైర్మన్ దండు తిరుపతి   పాల్గొన్నారు.