మృతుని కుటుంబానికి బియ్యం వితరణ

మృతుని కుటుంబానికి బియ్యం వితరణ

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన సంపంగి రాజవ్వ మల్లయ్య పెద్ద కుమారుడు సంపంగి రాజు గత పది రోజుల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయి మృతి చెందగా చేతికి వచ్చిన కొడుకుని కోల్పోవడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.

ఇట్టి విషయాన్ని ఆ గ్రామ యువకులు ద్వారా తెలుసుకున్న  బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి  50 కిలోల బియ్యన్ని మంగళవారం జితేందర్ రెడ్డి ద్వారా అందజేయడం జరిగింది. ఇకపై ముందుగా వాళ్ల కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి,సనత్ రెడ్డి, దిలీప్ గౌడ్,మధు,రోహిత్, సాయి కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.