ప్రజాసంక్షేమం  కోసమే నూతన పథకాలు - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజాసంక్షేమం  కోసమే నూతన పథకాలు - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిందని, ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచటం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ఆయన శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు ప్రయోజనం కలిగించేందుకేనని అన్నారు. స్థానిక ప్రధానాసుపత్రిలో  రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు. స్థానిక బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన రాజ్, ఆర్టీసీ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.