లక్కీ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లు 

లక్కీ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను లక్కీ డ్రా పద్దతిలో శుక్రవారం కేటాయించారు. మంచిర్యాల శివారులోని పద్మావతి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ లక్కీ డ్రా పద్ధతి ఏర్పాటు చేశారు. ప్రాథమిక అర్హత సాధించిన మహిళలు హాజరయ్యారు. అందరి సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 330 డబుల్ బెడ్ రూమ్ లను రాజీవ్ నగర్ లో నిర్మించారు. లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు సంతోష పడగా బెడ్ రూమ్ రాని మహిళలు నిరాశతో వెనుతిరిగారు. తనకు ఇల్లు వస్తుందని గంపెడు ఆశతో వచ్చిన ఓ మహిళ ఎంపిక కాకపోవడంతో స్పృహ తప్పిపడిపోయింది.