డబుల్ ఇంజన్ సర్కారే మా ధ్యేయం బిజిపి నాయకుడు తిరుపతిరెడ్డి 

డబుల్ ఇంజన్ సర్కారే మా ధ్యేయం బిజిపి నాయకుడు తిరుపతిరెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బీజేపీ పాలనలోనే అభివృద్ది సాధ్యమౌతుందని డబుల్ ఇంజన్ సర్కారే మా ధ్యేయం బిజేపి నియోజక నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో 247,248 బూత్ మహాజన్ సంపార్క్ అభియాన్ కార్యక్రమంలో బాగంగా  ఇంటింటికి వెళ్లి బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి సక్షేమ పనులను ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల సుపరిపాలనలో దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజలు కూడా మోడీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, ఇలాంటి మార్పు రావాలన్నదే బిజెపి లక్ష్యమని, వచ్చే ఎన్నికల్లో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇంచార్జ్ శేఖర్ జి,  జగిత్యాల అర్బన్ మండల ఇంచార్జ్ జున్ను రాజేందర్, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి,రూరల్ మండల అధ్యక్షులు  నలువాల తిరుపతి, జగిత్యాల అర్బన్ యువ మోర్చా అధ్యక్షులు బొల్లం అజయ్ కుమార్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు తేనుగు సాయికృష్ణ, ఎస్టి  సెల్ అధ్యక్షుడు  ఆలుగొండ దాసరి ప్రసాద్, ధనపూనేని నితిన్, వినయ్, పంబాల రాజనర్సయ్య,నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.