బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా డా.భోగ.శ్రావణి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా డా.భోగ.శ్రావణి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జగిత్యాలకు చెందిన మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా

భోగ.శ్రావణి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బండి.సంజయ్, సహకరించిన నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావులకు కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ప్రజల ఆశీసులతో బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న జగిత్యాలజిల్లా నాయకులకు , అసెంబ్లీ కన్వీనర్ లకు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికి కృతజ్ఞతలు తెలిపారు.