డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం అదుపు తప్పి వ్యక్తి కి తీవ్ర గాయాలు

డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం అదుపు తప్పి వ్యక్తి కి తీవ్ర గాయాలు

ముద్ర.వీపనగండ్ల:-ఎన్నికల సెక్టర్ అధికారి వినియోగిస్తున్న వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి ఓటర్ల మీదికి దూసుకురావడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద రూట్ నెంబర్ 16 సెక్టార్ అధికారి రవినారాయణ మండలంలోని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా మండల కేంద్రానికి వచ్చిన సెక్టర్ అధికారి వాహనం పోలింగ్ కేంద్రం బయట నిలిపి అధికారి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళగా డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నిలిపి ఉంచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలింగ్ కేంద్రం బయట ఉన్న ఓటర్ల పైకి వాహనం దూసుకురావడంతో దయ్యపు నరసింహ అనే వ్యక్తి వాహనం కింద పడటంతో మారు 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓటర్లు వాహనాన్ని పైకి లేపి వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన సంఘటనను చూసిన ప్రజలు కోపద్రిక్తంతో వాహన అద్దాల ను ధ్వంసం చేశారు.పోలింగ్ కేంద్రం వద్దనే ఉన్న వనపర్తి అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజ్ సంఘటన స్థలాన్ని వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ పై కేసు నమోదు చేయమని అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజ్ స్థానిక ఎస్ఐ రవి ప్రకాష్ కు సూచించారు.