ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ...

ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికలను 12న నిర్వహింనుంది ఈసీ. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. సీ.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్ పై అనర్హత వేటు పడడంతో ఈ రెండు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో తాజాగా ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.