స్ట్రాంగ్ రూములకు తరలిన ఈవీఎం యంత్రాలు

స్ట్రాంగ్ రూములకు తరలిన ఈవీఎం యంత్రాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిర్మల్ ముధోల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది గురువారం వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎం యంత్రాలను శుక్రవారం స్ట్రాంగ్ రూములలోకి తరలించి భద్రతా చర్యలు చేపట్టారు.

అంతకు ముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మూడు నియోజక వర్గాల కు సంబందించి కౌంటింగ్ కేంద్రాలను పాల్ టెక్నిక్ కళాశాల లో గట్టి బందోబస్తు తో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 22 రౌండ్స్, 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.