ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక చర్యలు
ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు నాయకులు వరుస షాక్లు ఇస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. అయితే.. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఈ మేరకు కీలక చర్యలను చేపట్టనున్నట్లు తెలిపింది.