కుర్చీపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
- లక్ష్మి దేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మించరా?
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ముద్ర, షాద్నగర్:- పట్టణ ముఖ్యకూడలి లో వినూత్నంగా కుర్చీ పై కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ను శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 లో పాలమూరు ఎత్తిపోతల పథకం లో భాగంగా లక్ష్మి దేవిపల్లి ప్రాజెక్ట్ ను స్వయంగా కుర్చీ వేసుకొని నిర్మించి షాద్ నగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా కు నీరు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు.లక్ష్మి దేవిపల్లి రిజార్వాయర్ ప్రాజెక్ట్ పై సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.రేపు కొల్లాపూర్ లో ట్రయల్ రన్ మోటార్ ప్రారంభిస్తున్నారని, మరి ఇక్కడ లక్ష్మి దేవిపల్లి రిజార్వాయర్ సంగతి ఏంటని ఇంతకు ప్రాజెక్ట్ అవుతుందా లేదా ఎదో ఒకటి ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు.ఈ సందర్బంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.