వ్యర్థాల పునర్వినియోగంతో పర్యావరణ రక్షణ

వ్యర్థాల పునర్వినియోగంతో పర్యావరణ రక్షణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలను తిరిగి ఉపయోగంలోకి తేవటంటం ద్వారా పర్యావరణం పై ఒత్తిడి తగ్గించవచ్చని సిఇఇ - ఈ శ్రీ గ్రీన్ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ శరత్ చంద్ర అన్నారు. స్థానిక విజయ శ్రద్ధ ఉన్నత పాఠశాలలో వ్యర్థాల నియంత్రణ, పునర్వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలను పునర్వినియోగం లోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ సంస్థ వ్యర్థాలను సేకరిస్తూ వాటిని తిరిగి వినియోగం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎం ఆర్ ఎఫ్ ఇంఛార్జి మంజుష, ప్రిన్సిపాల్ సూర్య, విద్యార్థులు పాల్గొన్నారు.