హుజరాబాద్ లో ఈటల ధర్నా
![హుజరాబాద్ లో ఈటల ధర్నా](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643ba46e93a26.jpg)
ముద్ర ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈటల రాజేందర్ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మితిమీరుతున్న పోలీసుల అరాచకాలకు నిరసనగా బీజేపీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.
అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ బిజెపి నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ అరాచకం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ నియంత్రత్వానికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.