చీఫ్ జస్టిస్ దగ్గర కూడా అవినాశ్ రెడ్డికి దక్కని ఊరట
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర కూడా అవినాశ్ రెడ్డికి దక్కని ఊరట. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సీజే ముందు మెన్షన్ చేసిన అవినాష్ లాయర్లు. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని తేల్చి చెప్పిన చీఫ్ జస్టిస్. చర్యలు తీసుకోకుండా రెండు వారాలు ఆపాలన్న అవినాశ్ లాయర్లు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. ఈ కేసుపై సుప్రీం డైరెక్షన్స్ ఇచ్చాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అసహనం. ఏదైనా సరే వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవాలన్న హైకోర్టు.