ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని హోమం

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని హోమం
  • రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికే మునుగోడు అభివృద్ధిలో ఆదర్శమవుతుంది
  • డిసిసిబి డైరెక్టర్, మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని హోమం నిర్వహించిన అభిమానులు, నాయకులు

ముద్ర ప్రతినిధి, నల్గొండ/మునుగోడు: తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటులో ఆయన చేసిన పోరాటం కీలకమని డిసిసిబి డైరెక్టర్, మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని శుక్రవారం మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో ఉండి కూడా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సాధనకై కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించిన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికే మునుగోడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సాధించినాయన నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులు బంద్ చేపించారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంత వీణా స్వామి గౌడ్, సర్పంచ్ తాటికొండ సంతోష సైదులు, నాయకులు పాలకూరి నరసింహ, మేకల మల్లయ్య, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.