హజీపూర్ లో కేసీఆర్ కు రైతుల పాలాభిషేఖం

హజీపూర్ లో కేసీఆర్ కు రైతుల పాలాభిషేఖం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ కు హజీపూర్ లో బీఆరెస్ రైతులు పాలాభిషేకం చేశారు. లక్ష రూపాయలు బ్యాంకు లోను రుణ మాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా బీఆరెస్ సీనియర్ నాయకుడు బెల్లంకొండ మురళీధర్ మాట్లాడుతూ, చలన చిత్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పుస్కురి రామ్మోహనరావు సూచనల మేరకు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటన తో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. కేసీఆర్ రైతులకు ఎంతో అండగా ఉన్నారని కొనియాడారు. ఈకార్యక్రమంలో నాయకులు పుస్కురి శ్రీనివాస రావు , సింగతి మురళి, తోకల సురేష్ యాదవ్, మాజీ సర్పంచ్ గోనె సంజయ్ పాల్గొన్నారు.