విద్యార్థుల కి ప్రతిభా పేపర్లు పంపిణీ చేసిన ఫరూఖ్ నగర్  జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి

 విద్యార్థుల కి ప్రతిభా పేపర్లు పంపిణీ చేసిన ఫరూఖ్ నగర్  జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి

ముద్ర, షాద్‌నగర్:-ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలి జర్ల  గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫరూఖ్ నగర్ జెడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి  10 వ తరగతి విద్యార్థులకు  ప్రతిభ పేపర్స్ ను  అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువు దశలో 10 వ  వ తరగతి కీలకం అని  విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి  చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఫరూఖ్ నగర్, కొందూర్గ్ మండల లో విద్యార్థులకు ప్రతి రోజూ 1750 ప్రతిభ పేపర్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల ఎం ఈ ఓ శంకర్ రాథోడ్, గ్రామ సర్పంచ్ అమృతమ్మ నర్సింహ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లావణ్య అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజు, గ్రామ నేతలు అశోక్ రెడ్డి, నర్సింహ రెడ్డి, గణేష్ గౌడ్, జాంగారి రవి, తుప్పారి యాదగిరి ,దొడ్డి రాందాస్, తుప్పరీ శేఖర్, దొడల శేఖర్ యాదవ్, ఖాజా మోయినొద్దిన్ , పాఠశాల  ఇంఛార్జి హేచేఎం ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు  పాల్గొన్నారు.