బిఆర్ఎస్ కు బాయ్ బాయ్.. కాంగ్రెస్ కి జిందాబాద్

బిఆర్ఎస్ కు బాయ్ బాయ్.. కాంగ్రెస్ కి జిందాబాద్
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన దేవుని పల్లి మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ 

ముద్ర, షాద్ నగర్: ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ తో పాటు ఉప సర్పంచ్ లక్ష్మీనరసింహులు శివరాములు గౌడ్ యాదయ్య అశోక్ కుమార్ జంగయ్ కిషన్ కృష్ణయ్య శ్రీనివాస్ ప్రవీణ్ రాములు శ్రీకాంత్ గణేష్ రాజు ఫారుక్ మహబూబ్ నర్సింలు రాజశేఖర్ లింగం రమేష్ రామస్వామి యాదయ్య బుడ్డ యాదయ్య రెండుపల్లి రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. తిరిగి సొంత పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు తాండ్ర కాశినాథ్ రెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రిస్ లను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మండల ఎంపీపీ ఇద్రీస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు..