భక్తులకు, దీక్ష పరులకు ఉచిత బస్సు సౌకర్యం

భక్తులకు, దీక్ష పరులకు ఉచిత బస్సు సౌకర్యం

ముద్ర, మల్యాల : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు, దీక్ష పరులకు దేవస్థానం నుండి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బొజ్జ పోతన్న పార్కింగ్ స్థలం నుండి దేవస్థానం వరకు రెండు ఉచిత బస్సు సౌకర్యం భక్తులు వినియోగించుకోవాలని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ అంజయ్య, సూపరిండెంట్లు సునిల్, శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు.