13న మంచిర్యాల లో ఉచిత వైద్య శిబిరం

13న మంచిర్యాల లో ఉచిత వైద్య శిబిరం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  మంచిర్యాలలోని మెడిలైఫ్ ఆసుపత్రిలో  ఈనెల 13వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యుడు కుమార స్వామి వెల్లడించారు. ఈమేరకు ఆదివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మెడిలైఫ్ ఆసుపత్రిలో వైద్య శిబిరం జరుగుతుందన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు చెప్పారు.  హైదరాబాద్ లోని ప్రముఖ కేర్, సన్ షైన్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు పరీక్షలు చేస్తారని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత పరీక్షలు ఉంటాయని, అవసరమైతే  ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు  చేయడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి గొంగళ్ల శంకర్ మిత్ర బృందం సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో గొంగళ్ల శంకర్, భూమేష్, నల్లశంకర్, గోపి, రాకేష్, శ్రీనివాస్, జగ్గరి సంజీవ్ పాల్గొన్నారు.