నేటి నుంచి శ్రీహరిరావు 'వస్తున్నా మీకోసం'

నేటి నుంచి శ్రీహరిరావు 'వస్తున్నా మీకోసం'

ముద్ర ప్రతినిధి, నిర్మల్:కాంగ్రెస్ నాయకుడు, ఉద్యమ నేత,కూచాడి శ్రీహరి రావు శుక్రవారం నుంచి  'వస్తున్నా మీ కోసం' పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం  ఉదయం  లక్ష్మణచాంద మండలం బోరిగాం గ్రామంలో ప్రారంభమై వడ్డేపల్లి, బోరిగాం తాండ, కాశీగూడ గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. నిర్మల్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ఈ యాత్రను చేపట్టినట్లు శ్రీహరి రావు వివరించారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను  జనంలోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు.