మండప నిర్వాహకులు  ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాలి

మండప నిర్వాహకులు  ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాలి
  • ఎస్పీ ఎగ్గడి భాస్కర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గణేశ్​ మండప నిర్వాహకులు పోలీసు శాఖ ఆన్​లైన్​లో  నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. పోలీసు శాఖ  రూపొందించిన గణేశ్​ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్​లైన్​ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ సంబంధించిన సమాచారం కోసం మాత్రమే రూపొందించిందన్నారు.  ఈ  సమాచారంతో భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.  ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుం లేదని ఎస్పీ తెలిపారు. గణేశ్​ ఉత్సవాల నిర్వాహకులు  విగ్రహాలను వివిధ ప్రాంతాలలో  ఏర్పాటు చేసే ముందు, ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో ఇవ్వాలని  అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలన్నారు. అందుకోసం http://policeportal.tspolice.gov.in అనే site నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని ఎస్పీ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు  అని  ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా  100 కి  సమాచారం అందించలని సూచించారు. ఈ పండుగను శాంతి యుతంగా నిర్వహించుకోవాలని కోరారు .