బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గంజాయి కలకలం

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో  గంజాయి కలకలం

ముద్ర,నిర్మల్:- బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. క్యాంపస్‌లో గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సిబ్బందికి పట్టుబడ్డారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చినట్లు సమాచారం.