వైభవంగా హనుమాన్ శోభాయాత్ర 

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య శోభయాత్ర ను ప్రారంభించి భక్తులతో కలిసి  హనుమాన్ శోభాయాత్రలో  పాల్గొన్నారు. సమాజంలో శాంతి, సమాధానం, ఆధ్యాత్మిక భావన , ధార్మిక చింతనను పెంపొందించడానికి ఇలాంటి శోభాయాత్రలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఈ శోభాయాత్రలో స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, మార్కెట్ వైస్ ఛైర్మన్ చల్లా చందర్ రెడ్డి, గ్రామాశాఖ అధ్యక్షులు మునిగాల రాజు, హనుమాన్ భక్తమండలి ఇల్లందుల ప్రసాద్ బంగ్లా శ్రీను, గోనెల రాజేందర్ ప్రసాద్, నీల గట్టయ్య,  పెసరు సారయ్య, మునిగేల రాజు,  ఎంపిటిసి గన్ను నరసింహులు, కుంభం నరేందర్, కొలిపాక వేణు, గోనెల ఉప్పలయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.