శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- కస్టమ్స్ అధికారుల అదుపులో స్మగ్లింగ్ కి సహకరించిన విమానాశ్రయ ఉద్యోగి
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : విదేశాల నుంచి ప్రయాణికుడు 933 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ అధికారులకు చిక్కాడు. గురువారం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడు రూ.56.63 లక్షల విలువైన 933గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొచ్చాడు. పథకం ప్రకారం ఓ చెత్తబుట్టలో పడేసి జారుకునేందుకు యత్నించాడు. వాటిని తీసుకోవడానికి విమానాశ్రయంలో పనిచేసే ఓ ఉద్యోగి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా గమనించిన భద్రతాధికారులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.