మహా గణపతికి పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్
![మహా గణపతికి పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_65094c0bcf79b.jpg)
ముద్ర, యాదగిరిగుట్ట :యాదగిరిగుట్ట పట్టణంలో శివా లాడ్జి గల్లిలోని మహా గణపతికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలేరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవ దేవుడైన గణనాథుడిని వేడుకున్నానన్నారు. ప్రజలందరూ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారన్నారు. పార్వతీ తనయుడి అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయన్నారు. మన తెలంగాణలో ఈ వినాయక చవితి పండుగను కుల, జాతి, మత ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.