పదో తరగతి  పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - నిందితులను కఠినంగా శిక్షించాలి : కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 

పదో తరగతి  పేపర్ల లీకేజీకి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - నిందితులను కఠినంగా శిక్షించాలి : కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో పదో తరగతి  పేపర్ల లీకేజీకి నిరసనగా మండల కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని చిన్న చూపుగా చూస్తుందన్నారు. నిందితులను శిక్షించి పేపర్ల లీకేజీని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. గ్రూప్ వన్ పరీక్ష,  డీఏవో పరీక్ష,  ఇంజనీరింగ్ పరీక్షలను రద్దుచేసి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థుల తెలుగు, హిందీ పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు.దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, గుండాటి రామ్ రెడ్డి,దండు శ్రీనివాస్,గంట బుచ్చ గౌడ్,రఫీక్, చెరుకు ఎల్లయ్య, చెన్ని బాబు,  హిమాం ,మహేందర్, కిషన్ ,బిపేట రాజు, మానుక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు