చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపిన గ్రామపంచాయతీ సిబ్బంది

చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపిన గ్రామపంచాయతీ సిబ్బంది

ముద్ర తుర్కపల్లి న్యూస్ :తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పల్లెపాటి లక్ష్మీనరసింహ మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను గ్రామపంచాయతీ సహాయ కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎరకల స్వామి, ప్రధాన కార్యదర్శి కసరబోయిన శ్రీశైలం యాదవ్ ,కోశాధికారి తూటీ కృష్ణ ,ప్రచార కార్యదర్శి బుషీ శేఖర్ ,దానావత్ మల్లేష్, ముఖ్య బాలాజీ రాజు కార్యవర్గ సభ్యులు పలుగుల ప్రశాంతి  ,భువనేశ్వరి, ప్రభాకర్ పోచమ్మ ,భాగ్యమ్మ, యాదమ్మ, వరమ్మ , ఆంజనేయులు, కిష్టయ్య, ఆశీర్వాద్, మహేష్  తదితరులు పాల్గొన్నారు.