ఘనంగా ఆరట్టు వేడుకలు

ఘనంగా ఆరట్టు వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆరట్టు వేడుకలు శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలను పట్టణ వీధుల్లో శోభాయాత్ర గా  ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి, ఆయన సతీమణి వినోద, భక్తులు పాల్గొన్నారు.