దేవరకోటలో ఘనంగా ధనుర్మాస వేడుకలు 

దేవరకోటలో ఘనంగా ధనుర్మాస వేడుకలు 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కేంద్రంలో అత్యంత పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలకు భక్తులు విశేషంగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. అనంతరం తిరుప్పావై సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు భారీగా హాజరయ్యారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.