మంచిర్యాల జిల్లాలో అంబరం అంటిన సంబరాలు

మంచిర్యాల జిల్లాలో అంబరం అంటిన సంబరాలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని చుంభించాయి. వాడ వాడలా త్రివర్ణ పతాకం రెపరేపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలలో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. మంచిర్యాల లోని గాంధీ పార్కులో ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు సురేఖ, కూరగాయల మార్కెట్ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, డీసీపీ కార్యాలయంపై సుధీర్, బీఆరెస్ కార్యాలయంపై చలన చిత్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పుస్కురి రామ్ మోహన్ రావు జెండాను ఆవిష్కరించారు.