ఘనంగా జయ శంకర్ జయంతి

ఘనంగా జయ శంకర్ జయంతి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయం ప్రాంగణంలో ఆచార్య, దివంగత జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం లో జయశంకర్ సార్ పాత్ర కీలకమన్నారు. తొలి, మలి దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన ముందు వరుసలో నిలిచి పోరాటం చేశారని గుర్తు చేశారు.