ఘనంగా సాయి పుణ్యతిథి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

ఘనంగా సాయి పుణ్యతిథి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలోని కృష్ణా రెడ్డి నగర్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మంగళవారం సాయి పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.కాగడ హారతి తో మొదలుకొని ఆలయ సంకీర్తన, అభిషేకం, పతాకారోహణ, స్వస్తి పుణ్యాహవాచనం, మంటప స్థాపన, స్థాపిత దేవత హవాసం, విశ్వకళ్యాణ యజ్ఞం, మహా పూర్ణాహుతి, కార్యక్రమాలను నిర్వహించారు.

గీతా సత్సంగ్ సభ్యులు లలితా సహస్రనామ పారాయణం, సంధ్య హారతి కార్యక్రమాలు నిర్వహించారు, సత్య సాయి భజన బృందం భజన తేజ హారతి జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం. అన్న పూజ నిర్వహించి భక్తుల కు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మహాజన్ నర్సింహులు, తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, దొంతుల రాజ్ కుమార్, చొక్కయ్య, సుతారి అంజయ్య, సాంబారి ప్రభాకర్,లింగం పెళ్లి సంజీవ్, సత్య సాయి  సేవ బృందం భక్తులు పాల్గొన్నారు.