రామారావు పటేల్ కు ఘన సన్మానం

రామారావు పటేల్ కు ఘన సన్మానం

లోకేశ్వరం,ముద్ర: నిర్మల్ జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు బుధవారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు రాజారాం మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కురుమలకు మీ యొక్క సాహసాకరాలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఇంతకుముందు ఉన్న టి బిఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్ల కోసం అనేక రకాలుగా డీడీలు తీశారు అన్నారు. ప్రభుత్వము మార్పు వల్ల గొర్లు రావడం లేదు కాబట్టి ఎవరైతే డిడి కట్టారో వారికి రూపాయలు వాపాసు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజేశ్వర్ వివిధ గ్రామాల కురుమలు పాల్గొన్నారు.