గురుకుల పాఠశాల విద్యార్థికి పాము కాటు....

గురుకుల పాఠశాల విద్యార్థికి పాము కాటు....

 ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, విద్యార్థి పరిస్థితి విషమం..

ముద్ర, వీపనగండ్ల (జూలై 16): జిల్లాలోని కొత్తకోట సమీపంలోని వీపనగండ్ల గురుకుల పాఠశాల విద్యార్థికి శనివారం రాత్రి 10 గంటల సమయంలో పాము కాటు వేసింది. ప్రిన్సిపాల్ కు సమాచార అందించిన నిర్లక్ష్యంతో రాత్రి అంతా హాస్టల్ రూమ్ లో పండుకోబెట్టి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో విద్యార్థి పరిస్థితి విషమించడంతో తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలిపిన తర్వాత ఆసుపత్రికి విద్యార్థిని తరలించారు. రాత్రి జరిగిన సంఘటన ప్రిన్సిపల్ దయాకర్ వెంటనే స్పందించకుండా పాము కాటుకు గురైన విద్యార్థి పట్ల నిర్లక్ష్యం వహించడం కాకుండా ఆసుపత్రి కూడా ఆలస్యంగా తరలించి తల్లిదండ్రులకు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆలస్యంగా సమాచారం ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని వెంట వాచ్ మేన్ మాత్రమే పంపి చికిత్స పొందుతున్న విద్యార్థిని ఇప్పుడు వరకు ప్రిన్సిపల్ పట్టించుకోలేదు తల్లిదండ్రులు బంధువులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ప్రిన్సిపాల్ పై  ప్రభుత్వం పెట్టింది కానీ ఇలాంటి నిర్లక్ష్య విధులు నిర్వహించే ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు బంధువులు కోరుతున్నారు.