ఆ విషయంలో ఆయన సిద్ధహస్తుడు 

ఆ విషయంలో ఆయన సిద్ధహస్తుడు 


అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు  లేనిది ఉన్నట్లు చెప్పడంలో సిద్ధహస్తులని ధ్వజమెత్తారు. 2019లో వైసీపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని చెప్పుకొచ్చారు. 29 రాష్ట్రాల్లో ఏపీ పోలీసులు బాగా పని చేశారని కేంద్రం కూడా చెప్పిందని గుర్తుచేశారు. అనవసరమైన ఇష్యూలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగడం లేదని పేర్కొన్నారు. ఇక బీసీలకు  చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిందేనని తెలిపారు. జగన్ ప్రభుత్వం  మాత్రం బీసీలకు ఎంతో చేసిందని గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ డాక్టర్స్, లాయర్స్‌గా పనిచేసిన వారు.. అదే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు.