మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కార్యకర్తుల, అభిమానులు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అటు టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటలకే సభా వేదిక వద్ద జనం కిక్కిరిసి పోయి ఉన్నారు.ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు.