హీరా గోల్డ్ కుంభకోణం.. రూ.33.06 కోట్ల ఆస్తుల అటాచ్
![హీరా గోల్డ్ కుంభకోణం.. రూ.33.06 కోట్ల ఆస్తుల అటాచ్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641eda3ee9997.jpg)
హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్కు చెందిన మరో రూ.33.06 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వ్యక్తిగత, సంస్థకు చెందిన 24 చరాస్తులను అటాచ్ చేసింది. గతంలో సుమారు రూ.367కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. హీరా గోల్డ్ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. నౌహీరా షేక్ మీద మొత్తం పది కేసులున్నాయి. హీరా గోల్డ్ కుంభకోణం వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. మనీలాండరింగ్ కేసులో 2018 అక్టోబర్ 16వ తేదీన నౌహీరా షేక్ను అరెస్టు చేశారు.