హెలిప్యాడ్, సభ స్థల పరిశీలన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

హెలిప్యాడ్, సభ స్థల పరిశీలన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 24 న సి.యం. పర్యటన సందర్బంగా సభ స్థలం, హెలిప్యాడ్ లాండింగ్ స్థలాన్ని జిల్లా యస్.పి. రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ లతో కలసి జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని నూతన కలెక్టరేట్, యస్.పి. ఆఫీస్, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనాలు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులచే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున పట్టణంలోని పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్,జిల్లా అధికారులను ఆదేశించారు.

స్థానిక ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న కొత్త మార్కెట్ యార్డ్ కు వెళ్లే రోడ్డు పక్కన సభా స్థలాన్ని అలాగే హెలిఫ్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని ప్రాథమికంగా పరిశీలించారు. ఆయా స్థల యజమానులతో భూములకు సంబంధించి వివరాలు సేకరించి చర్చలు జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, డి.యస్.పి. నాగభూషణం, రవి, ఈఈ ఆర్ అండ్ బి యాకుబ్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..