నల్లములలో హోంగార్డు గల్లంతు

నల్లములలో హోంగార్డు గల్లంతు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  మంత్రి బందోబస్తు కోసం వచ్చిన ఓ హోంగార్డు కనిపించకుండా పోయాడు..ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో చోటుచేసుకున్నది..మంగళవారం మన్ననూరు గ్రామంలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు..ఇక్కడికి బందోబస్తు కోసం ఈగలపెంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వెంకటేశ్ వచ్చాడు..

హరిత హోటల్ వద్ద బందోబస్తు విధులు నిర్వహించాడు..తర్వాత వస్తానని తోటి ఉద్యోగులకు చెప్పి... అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు..రాత్రి ఇంటికి వెళ్లకపోవడంతో వెంకటేశ్ భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది..వెంకటేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు..దూర్వాసుల చెరువు వైపు వచ్చినట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని సీఐ ఆదిరెడ్డి ఎస్సై వీరమల్లు తెలిపారు..ఉదయం నుండి చెరువులో ఫైర్ సిబ్బంది, పోలీసులు, బంధువులు గాలిస్తూ ఉన్నారు..