సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను

సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను

రామకృష్ణాపూర్, ముద్ర: రజక సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నడిగోట తిరుపతి అన్నారు.శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్.ఆర్.కె పాఠశాల సమీపంలోని రజక సంఘం కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా నడిగోట శంకర్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి సమ్మయ్య, క్యాషియర్ తిరుపతి, మహిళా అధ్యక్షురాలుగా జాలిగపు రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రజక సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.